ఈ మధ్యనే మన అరవయ్యో స్వాతంత్ర దినోత్సవం గట్టిగా జరిపేసుకున్నాం. బ్లాగుల్లో కూడా చాలామంది సందడి చేసారు. కానీ ఈ స్వాతంత్ర్యానికి సార్ధకత ఎంత వరకూ అంటూ గాఢ నిట్టూర్పులు విడిచిన వాళ్ళే ఎక్కువ. వీళ్ళందరినీ చూసి నేను కూడా కొంత సందిగ్ధంలో పడ్డాను కానీ, ఈరోజు బయటపడ్డ ఈ వార్త నా సందేహాన్ని పటాపంచలు చేసింది.
స్వతంత్ర భారత న్యాయశాఖామంత్రివర్యులు నెహ్రూ కుటుంబానికి మన స్వాతంత్ర ఫలాలు రుచిచూపించారు. స్వయంగా ఖత్రోచిని ఇంటిదగ్గర దిగబెట్టి వచ్చారు.
ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? నెహ్రూ కుటుంబం తింటే ప్రజలందరూ తిన్నట్టే కదా. తెలియకపోతే మన రాజ్ ని చూసి తెలుసుకోండి.