మొన్న రాత్రి దూరదర్శన్ వారు ఈ దేవాలయాన్ని చూపించారు. కృష్ణాజిల్లాలో ఉందని చెప్పినట్టు గుర్తు. ఈ దేవాలయం క్రీ.పూ.3 వ శతాబ్దం నాటికే నిర్మించబడి ఉందని ఆధారాలున్నాయిట. మన భారతదేశంలోని అతి పురాతన దేవాలయాలలో ఇదీ ఒకటని చెప్పవచ్చు.
దేశభాషలందు తెలుగులెస్స! అని బోధించి కృష్ణదేవరాయలచే ఆముక్త మాల్యద రచింపచేసింది ఈ స్వామియే. ఈ విషయం ఎంతమంది తెలుగు వారికి తెలుసో నాకు అనుమానమే. ఐనా ఇప్పుడు తెలుగు వేరు, ఆంధ్రభాష వేరు అనుకుంటా. ఆ కాలంలో ఇన్ని తెలివితేటలు లేవు మరి.
ఈ స్వామి దేవాలయానికి సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన ఇతిహాసం నాకు తెలిసింది ఉంది. విజయనగర సామ్రాజ్య ప్రాభవంలో వెలిగిన ఈ దేవాలయం, తరువాత సరైన పాలన లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందిట. అప్పుడు కాసుల పురుషోత్తమ కవి అనే ఆయన ఈ స్వామి పై నిందాస్తుతిగా ఆంధ్ర నాయక శతకాన్ని రచించాడుట. ఇది విని అప్పట్లోని జమీందారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడని చెప్పుకుంటారు.
ఈ ఆంధ్రనాయక శతకం సీస పద్యాలతో రచించ బడింది. అద్భుతమైన ధార, ఆకట్టుకునే శైలి ఈ కవి సొత్తు. మీరు ఈ శతకాన్ని ఇక్కడ చదివి ఆనందిచవచ్చు.
పద్యాలు చాలా సరళంగా ఉంటాయి. క్లిష్టమైన పదాలకోసం బ్రౌను నిఘంటువు వాడండి. అర్ధం కాకపోవడం ఉండదు.
ఈ కవి గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఎంత కాకతాళీయం! మొన్న విజయవాడ బస్ స్టాండులో పుణ్యక్షేత్రాల పట్టికలో ఈ గుడి గురించి చూశా. ఆప్పుడే తెలిసింది ఈ గుడి కృష్ణా జిల్లాలో ఉందని. మేము ఏడో క్లాసులో ఉన్నప్పుడు ‘చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ మకుటం’తో కొన్ని శతక పద్యాలు నేర్చుకొన్నాం. అప్పుడు నాకు తెలిసిన శ్రీకాకుళం ఒకటే- ఉత్తరాంధ్రాలోనిది. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ సినిమా కి, ఈ గుడికి ఏమైనా లంకె ఉందా?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సత్యసాయి — ఫిబ్రవరి 13, 2007 @ 2:37 అపరాహ్నం
ఆంధ్రమహావిష్ణువు దేవాలయం గురించి దూరదర్శన్ వారు చూపింఛటమూ, దాన్ని గురించి మీరు రాయటమూ చాలా సంతోషం. శ్రీకాకుళానికి దగ్గర్లోనే విజయవాడలో పెరిగినా, ఈ పట్టణం ఎప్పుడూ చూడలేదు.
సత్యసాయి గారూ,
ఈ ఆంధ్రవిష్ణువు ఎక్కణ్ణించి వచ్చాడో ఎవరికీ తెలీదు. ఒక జానపద వీరుడు తన వీరోచిత చర్యల వల్ల ప్రజలతో దేవుడిగా గుర్తింపబడ్డాడు అన్న కథ ఆధారంగా సినిమా తీశారు. ఆంధ్ర విష్ణువు ఆదేశంతో ఆముక్తమాల్యద ఎలా పుట్టిందో
ఇక్కడ చదవండి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 13, 2007 @ 7:42 అపరాహ్నం
ఇక్కడ
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 13, 2007 @ 7:43 అపరాహ్నం
naaku ilaanti vishayaalu telusukoavadam caalaa ishtam.thanks.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఫిబ్రవరి 14, 2007 @ 12:55 పూర్వాహ్నం
Saigaru & Radhika garu, Thanks.
Swamygaru, Thanks for the link and the info.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sriram — ఫిబ్రవరి 16, 2007 @ 8:19 పూర్వాహ్నం
శ్రీకాకుళం గ్రామం క్రిష్ణా నది ఒడ్డున, విజయవాడ కి 50 కి.మీ దూరంలో ఉంది. కాసుల పురుషోత్తమ కవి చల్లపల్లి జమీందారు ఆస్థానం లో కవి (చల్లపల్లి, శ్రీకాకుళం కి 9 కి.మీ దూరం). ఈ దేవాలయం సందర్సించాలి అంటే విజయవాడ నుండి బస్సు లో 2 గం. ప్రయాణం.
-నేనుసైతం
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నేనుసైతం — జులై 6, 2007 @ 4:28 అపరాహ్నం